వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ జవాన్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. జమ్ముకశ్మీర్లోని సాంబ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న నాగరాజు.. అక్కడే తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబ కలహాలే జవాన్ ఆత్మహత్య కారణమని తెలుస్తోంది.
TG Jawan Suicide: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ నాగరాజు జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మూడు రోజుల క్రితం నాగరాజు విధుల్లో ఉండగానే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడరు. ఈరోజు ఉదయం ఆర్మీ అధికారులు నాగరాజు కుటుంబాన్ని అతడి ఫ్యామిలీకి అప్పగించారు.
జవాన్ ఆత్మహత్య..
జవాన్ నాగరాజు మృతితో నర్సంపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాలే జవాన్ నాగరాజు మృతికి కారణమని తెలుస్తోంది. నాగరాజుకు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. ప్రస్తుతం నాగరాజు ఆత్మహత్యకు కారణం ఏంటి? అనే దానిపై అతడి కుటుంబ సభ్యులు, భార్య నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మానసికంగా, శారీరకంగా ఎంతో దృడంగా ఉండే ఒక జవాన్.. ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు అంటున్నారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





