మెదక్ జిల్లా తూప్రాన్లో హల్దీవాగు దగ్గర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన మమత అనే తల్లి, తన ఇద్దరు చిన్నారులతో కలిసి వాగులో దూకింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మమతను స్థానికులు కాపాడారు.
TG Crime: మెదక్ జిల్లా తూప్రాన్లో హల్దీవాగు వద్ద చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన మమత అనే తల్లి, తన ఇద్దరు చిన్నారులతో కలిసి వాగులో దూకింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మమతను స్థానికులు కాపాడగలిగారు. కుటుంబ పోషణ భారం, భర్త మృతి అనంతరం ఎదురైన జీవన పోరాటం ఆమెను ఈ తీవ్ర నిర్ణయం తీసుకునే స్థితికి నడిపించిందని అనుమానిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో..
తూప్రాన్ మండలానికి చెందిన మమత గత కొంతకాలంగా తల్లితో కలిసి జీవితం కొనసాగిస్తోంది. భర్త మరణం తరువాత ఒక్కసారిగా కుటుంబం ఆదాయం కోల్పోయి, ఆర్థికంగా క్షీణించిపోయింది. పని,ఉద్యోగం లేకపోవడం, పెరిగిన ఖర్చులు, పిల్లల భవిష్యత్తుపై భయాలు ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు తేజస్విని, హారికను తీసుకుని హల్దీవాగు వద్దకు వెళ్లిన మమత, వారితో కలిసి నీటిలో దూకింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మమతను రక్షించారు. కానీ చిన్నారుల ప్రాణాలను కాపాడలేకపోయారు. వారి మృతదేహాలను గాలింపు చర్యల అనంతరం వెలికి తీశారు
ఈ ఘటన తూప్రాన్ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. చిన్నారుల మృతదేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పిల్లల మృతదేహాలను చూసి మమత శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇది బలవన్మరణయత్నమేనని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతోంది. ఇలాంటి ఘటనలు నేటికాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, జీవితంపై నమ్మకం కోల్పోవడం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, స్థానిక సంస్థలు మద్దతుగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.
Also read
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”
- Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి
- Drug Injections: ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం
- Ayodhya Ram Mandir: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా