నంద్యాల జిల్లా ఆత్మకూరలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరో పదిరోజుల్లో పెళ్లనగా వరుడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి వస్తుండగా .. అతడి బైక్ ని బొలెరో వాహనం ఢీకొట్టింది
మరో పదిరోజుల్లో పెళ్లనగా.. పెళ్ళికొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పారాణితో చూడాల్సిన కొడుకును ప్రాణం లేకుండా చూసిన ఆ కన్నతల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. పెళ్లి భాజాలతో కళకళలాడుతూ ఉండాల్సిన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఈ విషాదకరమైన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణం ఏకలవ్య నగర్ లో చోటుచేసుకుంది
పెళ్లి పత్రికలూ ఇవ్వడానికి వెళ్ళి..
అయితే ఆత్మకూరు కి చెందిన నాగేంద్ర అనే యువకుడు ఈ నెల 30న తన పెళ్లి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బంధువులందరికీ పెళ్లి పత్రికలు ఇస్తూ వస్తున్నాడు. అలా వరుడు నాగేంద్ర లింగాల గ్రామంలోని తన బంధువులకు పత్రిక ఇచ్చేందుకు వెళ్ళాడు. పత్రిక ఇచ్చిన తర్వాత తిరిగి ఆత్మకూర్ కి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగేంద్ర వెళ్తున్న బైక్ ని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు నాగేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మరో పది రోజుల్లో పెళ్లి చేసుకొని.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన కొడుకు.. ఇక లేడని తెలియడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. అతడి కన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది
Also read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..