అనంతపురం :జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు
* తదుపరి చర్యలలో భాగంగా … ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసుల చర్యలు
* పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చట్ట పరమైన చర్యలు తీసుకోనున్న పోలీసులు
* మృతురాలి కుటుంబ సభ్యులను ఐసిడిఎస్ అధికారులతో కలిసి విచారించిన ఒన్ టౌన్ సి.ఐ రెడ్డెప్ప…మృతురాలి ముగ్గురు పిల్లలను ఐసిడిఎస్ కు అప్పగింత…
* ఈనెల 23 వ తేదీన అంజలిని బేల్దారి పనుల కోసం ఉదయం 9 గంటలకు ఆటోలో తీసికెళ్లిన బాలు అనే బేల్దారి
* తిరిగి అదేరోజు రాత్రి 8 గంటలకు కొందరు అంజలిని స్థానిక షికారి కాలనీలో ఉన్న ఇంటి వద్ద వదలి వెళ్లినట్లు చెబుతున్న ఆమె కుటుంబ సభ్యులు
* ఆ తర్వాత… అదే రోజు రాత్రి 11:30 గంటల సమయంలో అంజలి, ఆమె భర్త రాజు తీవ్రంగా గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి
* ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు ఆమె చనిపోయిందని… అదే రోజు సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలులో భాగంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు సి.ఐ కు వివరించారు… అన్ని కోణాల్లో విచారించి చట్టపరంగా చర్యలు చేపట్టనున్నామని సి.ఐ తెలిపారు
Also read
- Weekly Horoscope: ఈ వారం వారి జాతకం మారబోతోంది… ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి యోగం!
- Chaturmasya Deeksha: చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
- Fasting Secrets: ఉపవాసాల సమయంలో సాధారణ ఉప్పు కాకుండా సైంధవ లవణమే ఎందుకు వాడతారో తెలుసా?
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్పై తీవ్ర ఆరోపణలు!





