మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నారద పుష్కరిణి తెప్పలపై శ్రీకాళహస్తీశ్వరుడు విహరిస్తూ భక్తులకు నయనానందం కల్పించారు. పట్టు వస్త్రాలు ,విశేష స్వర్ణాభరణాల మధ్య సర్వాంగ సుందరంగా ఉత్సవమూర్తులను వేర్వేరు తెప్పలపై ఉంచారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాలు,, భక్తుల శివనామ స్మరణల మధ్య తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నారద పుష్కరిణి అలలపై ఉత్సవ మూర్తులు ఐదు ప్రదక్షిణల అనంతరం ధూప ,దీప, నైవేద్య కైంకర్యాలు చేపట్టారు. తెప్పోత్సవం తిలకించేందుకు అశేషంగా భక్తులు తరలివచ్చారు
Also read
- నరక లోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట
- నేటి జాతకములు…27 ఏప్రిల్, 2026
- లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
- కార్మిక చట్టాల అమలు కు దీక్షాదినంగా మేడే….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!





