మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నారద పుష్కరిణి తెప్పలపై శ్రీకాళహస్తీశ్వరుడు విహరిస్తూ భక్తులకు నయనానందం కల్పించారు. పట్టు వస్త్రాలు ,విశేష స్వర్ణాభరణాల మధ్య సర్వాంగ సుందరంగా ఉత్సవమూర్తులను వేర్వేరు తెప్పలపై ఉంచారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాలు,, భక్తుల శివనామ స్మరణల మధ్య తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నారద పుష్కరిణి అలలపై ఉత్సవ మూర్తులు ఐదు ప్రదక్షిణల అనంతరం ధూప ,దీప, నైవేద్య కైంకర్యాలు చేపట్టారు. తెప్పోత్సవం తిలకించేందుకు అశేషంగా భక్తులు తరలివచ్చారు
Also read
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!
- Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా
- అన్నా.. అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- అర్ధరాత్రి అమ్మాయిని ఆటో ఎక్కించుకున్నాడు.. కాసేపటికే భయానకం.. చివరకు ‘శక్తి యాప్’తో
- అడిగితే కొడుతున్నారు.. భార్య కోసం టవర్ ఎక్కిన యువకుడు.. చివరకు ట్విస్ట్ మామూలుగా లేదుగా..





