తెలంగాణలో గత కొద్ది రోజులుగా లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఆ అఘోరీ ఇప్పుడు తెలంగాణ వదిలి మహారాష్ట్రలో ప్రత్యక్షమైంది. నాగ్పూర్ హైవేపై కారులో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిన్న అర్ధరాత్రి తెలంగాణ పోలీసులు అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు.
అఘోరీ ఆత్మార్పణ కథ సుఖాంతంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఆ అఘోరీ ఎక్కడుంది..? ఆమెను ఎక్కడికి తరలించారు.? నిన్న అర్ధరాత్రి తెలంగాణ పోలీసులు అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. అంతకంటే ముందు సనాతన ధర్మం కోసం సికింద్రాబాదు ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణం చేస్తానని ప్రకటించిన మహిళా అఘోరీని పోలీసులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లిలోని ఆమె స్వగృహంలో నిర్బంధించారు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి మండలం లకడికోటా వరకు తీసుకెళ్లి అఘోరిని వదిలేశారు. మరోవైపు గత రెండు వారాలుగా సనాతన ధర్మంపై మాట్లాడుతున్న అఘోరీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిందని న్యాయవాది రాజేష్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ వద్ద ఆత్మాహుతి చేసుకుంటానని ఆమె మాట్లాడటం సనాతన ధర్మాన్ని విరుద్దమని మండిపడ్డారు. తనను తాను నియంత్రించుకోలేని ఆమె … సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతోందని ప్రశ్నించారు. ఆమె వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. స్టేట్ హోమ్లో పెట్టి ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





