తీవ్రమైన కడుపునొప్పితో ఓ మహిళ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి.. స్కాన్ చేసి.. ఎక్స్రే తీయగా.. షాకింగ్ విషయం ఒకటి బయటకొచ్చింది. చివరికి బ్రతుకు జీవుడా.. అంటూ బ్రతికి బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
వివరాల్లోకెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం కోతులగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దారుణం జరిగింది. కుళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ జాస్మిన్కి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో దూది, చిన్న వైరు కడుపులో వదిలేశారు డాక్టర్లు. మే 27వ తేదీన కూనవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు బాధితురాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఇక ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో చేసేదేమిలేక భద్రాచలంలోని ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించింది బాధితురాలు. అక్కడ వైద్య సిబ్బంది స్కానింగ్ చేసి.. ఎక్స్రే తీయగా.. ఆమె కడుపులో దూది, వైరు ముక్క ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన డాక్టర్లు ఆపరేషన్ చేసి.. వాటిని బయటకు తీయడంతో.. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది బాధితురాలు. కాగా, తనకు ఇలా చేసిన కోతులగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సదరు బాధితురాలు.. న్యాయం కోసం ఆందోళనకు దిగింది
Also read
- Mystery Temple: ఈ శివాలయం ద్వారపయుగానికి సజీవ సాక్షం.. నేటికీ అశ్వత్థామ పూజలు.. సాక్షం ఇదే అంటున్న స్థానికులు
- Garuda Purana: అకాల మరణం తర్వాత ఆత్మ పయనం ఎటు? ఎన్ని రోజులకు శాంతి పొందుతుంది? ఏ పరిహారాలు చేయాలంటే..
- Astrology Tips: మొత్తం ఏ రాశిని ఏ దేవుడు లేదా ఏ దేవత పాలిస్తాడు? ఆ రాశికి ఉన్న దైవిక సంబంధం ఏమిటంటే
- Anchor Swetcha : యాంకర్ స్వేచ్ఛ కేసులో బిగ్ట్విస్ట్…ఆమె మరణానికి పూర్ణనే కారణం..?
- తిరుమలలో షాకింగ్ ఘటన.. చూస్తుండగానే కాలిపోయిన కారు..