సమాజంలో రోజురోజుకీ హత్యాకాండలు పెరిగిపోతున్నాయి. మనిషిని మనిషి చంపుకోవటమే దారుణం.. అలాంటిది అయినవాళ్లు తమ ఆత్మీయులను, కుటుంబసభ్యులను దారుణంగా కడతేర్చుతున్నారు. మనిషి మృగంలా మారిపోయి ఇష్టారీతిన నేరాలకు పాల్పడుతున్నాడు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఓ దారుణ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. అత్యంత దారుణంగా ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి స్వయానా కట్టుకున్న భార్య, కన్న కొడుకే ఈ హత్య చేయడం గమనార్హం.
బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిరిధిలోని క్రిస్టల్ టౌన్లో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది. వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న మసీఉద్దీన్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా రెండో భార్య షబానా, అతని కొడుకు సమీర్ హతమార్చారు. కాళ్లు, చేతులు కట్టేసి చాకుతో గొంతు కోసి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా హతుడు మసీఉద్దీన్ అచేతన స్థితిలో పడి ఉన్నాడు. అయితే కుటుంబంలో కలహాలే హత్యకు దారి తీశాయనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- Bomb attack: భద్రాచలం ఆస్పత్రిపై బాంబు దాడి.. రోగులు, సిబ్బందితోపాటు!
- బయటపడిన పురాతన విగ్రహాలు! ఇంకా ఉన్నాయి, తవ్వకాలు జరపాలని స్థానికుల డిమాండ్
- అక్రమ సంబంధం… భార్య రాగానే గోడ దూకి భర్త పరార్!
- ATM చోరీ కోసం యత్నించిన దొంగలు! ఊహించని ట్విస్ట్తో పరుగో పరుగు
- అయ్యో పాపం.. పసిబిడ్డను బలితీసుకున్న పందికొక్కులు! కన్నీళ్లు పెట్టించే ఘటన