మైనర్ బాలికలను ప్రేమపేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఈ ఘటన ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి మరి. యాదగిరిగుట్టలో చోటు చేసుకుంది. దీనిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లోని తార్నాకలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలకు మాయమాటలు చెప్పి.. సదరు యువకులు బడి ఎగ్గొట్టేలా చేశారు. ఆ యువకుల మాటలు నమ్మిన బాలికలు స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. శనివారం యాదగిరిగుట్టకు దైవ దర్శనానికి తీసుకెళ్లి.. అక్కడ ముగ్గురు బాలికలపై ఆ యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు.
అనంతరం బాలికలను హైదరాబాద్లో వదిలిపెట్టి పరారయ్యారు. సాయంత్రం తార్నాకకు తిరిగొచ్చాక జరిగిన సంఘటనపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు బాలికలు. బాలికల పేరెంట్స్ ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు అల్వాల్ పోలీసులు. వారిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికలను మోసం చేసిన యువకులలో GHMC కాంట్రాక్ట్ ఉద్యోగి మధు, షాపింగ్ మాల్లో పనిచేసే వంశీ, పెట్రోల్ బంకులో పనిచేసే నీరజ్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. కాగా, ఈ ముగ్గురు నిందితులతో పాటు.. లాడ్జి ఓనర్ను అదుపులోకి తీసుకున్నారు.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





