హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అక్రమంగా పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదాన్ని ఎత్తిచూపుతూ మాదాపూర్ పోలీసులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కవాతు నిర్వహించారు. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటుండగా, అదే సమయంలో వాహనం దూసుకురావడంతో చనిపోయాడు. అయితే ప్రయాణికులను అలర్ట్ చేయడం కోసం ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కవాతు చేశారు. మాదాపూర్ ఇన్ స్పెక్టర్ జి.మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.అనిల్ కుమార్, కె.అజయ్ లు బ్రిడ్జిపై సెల్ఫీలు తీసుకుంటుండగా శనివారం ఎంయూవీ ఢీకొట్టింది. అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, అజయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
ఈ ఘటనపై స్పందించిన మాదాపూర్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై, ముఖ్యంగా బ్రిడ్జిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెల్ఫీలు దిగుతూ పట్టుబడితే రూ.1,000 జరిమానా విధిస్తారు. నిర్లక్ష్యపు ప్రవర్తనను నిరోధించడానికి, ప్రజల్లో భద్రతకు భరోసా ఇవ్వడానికి కవాతు చేసినట్టు తెలిపారు
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





