SGSTV NEWS
CrimeTelangana

టీచర్ వేధింపులు భరించలేక కస్తూర్బాలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం



Kasturba Gandhi School : కస్తూర్బా గాంధీ పాఠశాలలో టీచర్ వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో చోటుచేసుకుంది.

కస్తూర్బా గాంధీ పాఠశాల(Kasturba Gandhi School)లో 9వ తరగతి విద్యార్థిని స్టడీ అవర్స్ study hours కు లేటుగా వచ్చిందని ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు విద్యార్థిని మూడు గంటల పాటు నిలబెట్టింది. వాటర్ తాగనీయకుండా, బాత్రూం కూడా వెళ్ళనీయకుండా పనిష్మెంట్ ఇచ్చిందని విద్యార్థిని వాపోయింది. దీంతో మనస్థాపానికి గురై చేయి కోసుకున్నానని చెప్పింది.


తమ కూతురును ఇబ్బందులకు గురిచేసి, మనస్తాపానికి గురిచేసిన టీచర్ కళ్యాణిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు అధికారులుకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని వేధించిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. జరిగిన సంఘటనపై ఎంఈఓ విచారణ చేపట్టారు.

Also read

Related posts

Share this