తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. యువకుడిని వెంటాడి వేట కొడవలితో నరికి చంపిన ఘటన కలకలం రేపింది. గత కొంతకాలగా హర్షవర్ధన్, నాగరాజు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి హర్షవర్ధన్ నాగరాజు ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించాడు. దీంతో నాగరాజు వేటకొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Also read
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!
- దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం కన్నతల్లినే దారుణంగా..





