అమరావతి: విజయవాడ లబ్బీపేట ప్రాంతానికి ఓ సస్పెక్ట్ షీటర్ పేరుపోగు క్రాంతికుమార్ (40) గత నెల 21న విషగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది, ఒక రోజు తర్వాత 22న చనిపోయాడు. అతను చనిపోయేముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తనను కృష్ణలంక సీఐ నాగరాజు తీవ్రంగా వేధిస్తున్నట్టు ఆ వీడియోలో బాధితుడు వాపోయాడు. ‘నా చావుకు కారణం సీఐ నాగరాజు. నన్ను వేటాడి వెంటాడి, వేధిస్తున్నారు. మూడు నెలల నుంచి కొడుతూనే ఉన్నారు. నేనింక బతకలేను. నా చావుకు కారణం ఆయనే. అందుకే గుళికల మందు తాగేస్తున్నా’ అని చెప్పి తన చేతిలో ఉన్న పౌడర్ మింగుతూ వీడియో తీసుకున్నాడు. అతనిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ.. మర్నాడు చనిపోయాడు.
Also read
- బ్రహ్మపుత్ర నదిలో పడి జమ్మలమడుగు యువతి మృతి
- కళ్లల్లో కారం చల్లి… కత్తులతో నరికి… RMP డాక్టర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- Video: రీల్స్తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ..
- ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన..
- Massive Scam: 70 మందికి టోకరా పెట్టిన రిటైర్డ్ టీచర్.. ఏకంగా ఏడు కోట్లు స్వాహా





