అమరావతి: విజయవాడ లబ్బీపేట ప్రాంతానికి ఓ సస్పెక్ట్ షీటర్ పేరుపోగు క్రాంతికుమార్ (40) గత నెల 21న విషగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది, ఒక రోజు తర్వాత 22న చనిపోయాడు. అతను చనిపోయేముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తనను కృష్ణలంక సీఐ నాగరాజు తీవ్రంగా వేధిస్తున్నట్టు ఆ వీడియోలో బాధితుడు వాపోయాడు. ‘నా చావుకు కారణం సీఐ నాగరాజు. నన్ను వేటాడి వెంటాడి, వేధిస్తున్నారు. మూడు నెలల నుంచి కొడుతూనే ఉన్నారు. నేనింక బతకలేను. నా చావుకు కారణం ఆయనే. అందుకే గుళికల మందు తాగేస్తున్నా’ అని చెప్పి తన చేతిలో ఉన్న పౌడర్ మింగుతూ వీడియో తీసుకున్నాడు. అతనిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ.. మర్నాడు చనిపోయాడు.
Also read
- రాడ్డుతో తలపై కొట్టి.. చెరువులో పడేసి..
- నా చావుకు కారణం.. కృష్ణలంక సీఐ నాగరాజు
- మహిళ ప్రాణం తీసిన కోతుల కొట్లాట!
- బిర్యానీ తెస్తానని వెళ్లి.. మృత్యు ఒడికి
- Bus Fire: గాడ నిద్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. క్షణాల్లో మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు!





