పల్నాడు జిల్లా : కోటప్పకొండ వేద పాఠశాలలో ఆగమం శాస్త్రం 4వ ఏడాది చదువుతున్న విద్యార్థి కుందుర్తి సాయి శివ సూరజ్ (16) వసతి గృహం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబాల పట్నం గ్రామానికి చెందిన సాయి శివ సూరజ్ అందరితో కలివిడిగా స్నేహంగా మెలిగే వాడని బుధవారం రాత్రి కూడా అందరితో సరదాగా గడిపారని తోటి స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పౌరోహిత్య విద్యను అభ్యసిస్తున్న సాయి శివ సూరజ్ ఆత్మహత్యతో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సమాచారం అందుకున్న రూరల్ వేద పాఠశాల వద్దకు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రి శవాగారానికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు
Also Read
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- నిడదవోలు నియోజకవర్గం – నిడదవోలు రూరల్ వివిధ గ్రామాలలో”రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటా తెలుగుదేశం” కార్యక్రమం*





