ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన
శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర ముగింపు సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి సింహ వాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించి మంగళ వాయిద్యాలు నడుమ తప్పెట్లు, డప్పు వాయిద్యాల మధ్య శ్రీ ముత్యాలమ్మ గ్రామోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో ఎస్.వి నాగేశ్వరరావు మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also read
- స్మార్ట్ఫోన్ కొనడం ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈఎంఐ భయంతో యువకుడి ఆత్మహత్య!
- ఉస్మానియా డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ప్రిన్సిపల్ సంచలన నిర్ణయం!
- ఊరు మారిన మారని బుద్ధి.. మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి!
- ఫేస్బుక్లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి వెళ్తే ఊహించని సీన్..
- సిగరెట్లే అతని టార్గెట్.. వరుస చోరీలతో పోలీసులకు దొంగ సవాల్





