హైదరాబాద్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? దానికి తగిన చదువు, సర్టిఫికెట్లు లేవా? ఫికర్ మత్కరో భాయ్. B.Com, B.Tech..ఇలా ఏదైనా మనదగ్గర సరసమైన ధరలకు దొరకుతాయంటున్నారు కూకట్ పల్లిలోని KPHB ప్రాంతంలోని “శ్రీ వ్యాస కన్సల్టెన్సీ’ నిర్వహకులు.
కూకట్ పల్లిలోని KPHB ప్రాంతంలో శ్రీ వ్యాస కన్సల్టెన్సీ అనే పేరుతో కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న ఈ ముఠా నకిలీ B.Com, B.Tech సర్టిఫికెట్లు తయారు చేసి విద్యార్థులకు విక్రయిస్తూ మోసం చేస్తోంది. SOT శంషాబాద్ బృందం చేసిన దాడిలో ఇద్దరు ప్రధాన నిందితులు ఆకాసపు హరీష్, మావూరి మహేష్ లు పట్టుబడ్డారు. వీరి వెనుక విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి కీలక పాత్ర ఉందని తేలింది. అతను ముఠాకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా ఈ ముఠా ఇప్పటి వరకు సుమారు 46 మందికి నకిలీ సర్టిఫికెట్స్ విక్రయించినట్లు వెల్లడైంది. ఈ ముఠా తయారుచేసిన నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా 24 మంది అభ్యర్థులు విదేశాలకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సర్టిఫికెట్స్ లేకుండానే వీరంతా వీసా పొంది విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్ల కోసం భారీగా డబ్బులు వసూలు చేసిన ముఠా, వారికి అవసరమైన సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలుస్తోంది.
అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్టాప్ కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ నిందితులను కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించిన ఎస్ఓటీ బృందం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా విదేశీ వీసాలు పొందిన వారిపై విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ముఠాలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతోందని కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





