భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. పది మంది శుక్రవారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్తే అందులో ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి
.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి దగ్గరలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. గోదావరి నదిలో శుక్రవారం సాయంత్రం స్నానానికి వెళ్లిన ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. మొత్తం పది మంది వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతయ్యారు. ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులకు వెంటనే సహయక చర్యలు చేపట్టాలని సూచించారు.
నదిలో తప్పిపోయిన వారిలో అంబటిపల్లి గ్రామానికి చెందిన నలుగు యువకులు, కొర్లకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులైన ఉన్నారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. గల్లంతమైన యువకుల కొరకు గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





