రామచంద్రపురం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోమండనం కేసు విచారణ 16కు వాయిదా పడింది. ఈ కేసులో ఇ ప్పటి కే పూర్తయిన సందర్భంగా ఈనెల 12న తుది తీర్పు వెలువరిస్తామని విశాఖ లోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల వెల్లడించింది. 28 ఏళ్లుగా దళితులు ఈ కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడుతుందని ఎదురు చూశారు. అయితే ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శుక్రవారం సెలవు పై వెళ్లడంతో ఈ కేసును ఈ నెల 16 కు వాయిదా వేశారు. 16 వచ్చే తీర్పు కోసం దళితులు ఎదురుచూస్తుండగా మరోవైపు ఇందులో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఈ తీర్పు కీలకం కానుంది.
Also read
- Monthly Horoscope July 202: ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు
- అత్తింటి వేధింపులు – ఇద్దరు పిల్లలతో బావిలో దూకి మహిళ ఆత్మహత్య
- JEE లో మంచి ర్యాంక్.. NIT లో సీట్.. ఇంజనీరింగ్ ఆపేసి ఏం చేస్తున్నాడో తెలుసా..?
- రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
- Hyderabad: పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..