రామచంద్రపురం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోమండనం కేసు విచారణ 16కు వాయిదా పడింది. ఈ కేసులో ఇ ప్పటి కే పూర్తయిన సందర్భంగా ఈనెల 12న తుది తీర్పు వెలువరిస్తామని విశాఖ లోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల వెల్లడించింది. 28 ఏళ్లుగా దళితులు ఈ కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడుతుందని ఎదురు చూశారు. అయితే ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శుక్రవారం సెలవు పై వెళ్లడంతో ఈ కేసును ఈ నెల 16 కు వాయిదా వేశారు. 16 వచ్చే తీర్పు కోసం దళితులు ఎదురుచూస్తుండగా మరోవైపు ఇందులో ప్రధాన నిందితుడైన తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఈ తీర్పు కీలకం కానుంది.
Also read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





