న్యూఢిల్లీ : బైక్ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న ఒకే కుటుంబానికి చెందిన సురేందర్, అతని సోదరీలతో కలిసి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నా ప్రాంతంలో వివాహానికి వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా, ఢిల్లీ సమీపాన ఉన్న గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ సమీపంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతివేగంగా వచ్చిన కారు.. వీరి బైక్ను ఢీకొట్టింది. కారు.. బైక్ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే సురేందర్, అతని సోదరీలు శైలి, అను మృతిచెందగా, మరొక మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బైక్ను ఢీకొట్టిన తర్వాత కారు వారి మీద వెళ్లినట్లు దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బైక్ను ఢీకొట్టిన కారును ఇంకా గుర్తించలేదన్నారు. అలాగే ఎవరినీ అరెస్ట్ చేయలేదని.. సీసీటీవీని పరిశీలించాక చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





