తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తిరుపతి: తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని ఎస్వీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రంలోని 254, 255, 256, 258 బూత్ల వద్ద వైకాపా రంగును పోలిన షామియానాలు, బెలూన్లు, పరదాలు ఏర్పాటు చేశారని అన్నారు. అవి ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని, వెంటనే తొలగించాలని ఆర్వో అదితిసింగ్ను.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్, జనసేన నేత ఆనంద్ తదితరులు కోరారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
Also read
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!
- నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





