తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

తిరుపతి: తిరుపతిలోని పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ రంగులు పోలిన షామియానాలు వేయడంపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలోని ఎస్వీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రంలోని 254, 255, 256, 258 బూత్ల వద్ద వైకాపా రంగును పోలిన షామియానాలు, బెలూన్లు, పరదాలు ఏర్పాటు చేశారని అన్నారు. అవి ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని, వెంటనే తొలగించాలని ఆర్వో అదితిసింగ్ను.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహయాదవ్, జనసేన నేత ఆనంద్ తదితరులు కోరారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




