తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల అండతోనే ఆ పార్టీ జరిగిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీలో రేవ్ పార్టీ కల్చర్ ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ జరిగిందన్న వార్త కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో మహిళలు నగ్నంగా డ్యాన్స్ చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అధికార పార్టీ అండదండలతోనే రేవ్ పార్టీ నిర్వహించాని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు.
Also Read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




