ఓ వ్యక్తి మైనర్ను బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటు చేసుకుంది.
లఖ్నవూ: ఓ వ్యక్తి మైనర్ను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఫోరీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉంటున్న అమన్(22) అనే యువకుడు.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఓ బాలిక వెంట పడ్డాడు. ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన అతడు ఆమెను బంధించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కాల్చిన ఇనుప రాడ్డుతో బాలిక ముఖంపై తన పేరు రాశాడు. అనంతరం బాలిక అతడి నుంచి తప్పించుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న మైనర్ను గుర్తించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Also read
- ప్రేమ.. పెళ్లి.. కోటి రూపాయల మోసం! భార్యపై భర్త, అత్తింటి వారి దారుణ దాడి
- రికవరీ నగదు కాజేసిన న్యాయవాది.. ప్రశ్నించిన కానిస్టేబుల్ హత్యకు కుట్ర
- సహజీవనం.. మహిళ నాలుక కోసి పారిపోయిన ప్రియుడు
- ఇష్టమని ఎక్కువగా దోసెలు తిన్న బాలుడు.. కాసేపటికే ఘోరం!
- కలికాలం.. ఆస్తి కోసం కన్నతల్లి శవాన్ని ఎత్తుకెళ్లిన పెద్దకొడుకు.. శ్మశానంలో కోడిని పూడ్చిన చిన్నకొడుకు!





