SGSTV NEWS online
Andhra PradeshCrime

దివ్యాంగురాలిపై అత్యాచారం



తిరుపతి: దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగిన ఘటన బుధవారం చౌడేపల్లి మండలంలో జరిగింది. చౌడేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు (54) ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతోంది. అదే గ్రామానికి చెందిన రాము (44) నిన్న అర్ధరాత్రి ఇంటిలోకి ప్రవేశించడంతో ఆమె కేకలు వేసింది. ఘటనపై బాధితురాలి కుటుంబీకులు చౌడేపల్లి ఎస్సై ప్రతాపరెడ్డికి ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తెలిపే వివరాలను బట్టి విచారణ చేపడతామని ఎస్‌ఐ తెలిపారు.

Also read

Related posts