ఆర్కేనగర్ (తమిళనాడు) : నిన్న ఎన్నికల ప్రచారంలో ఎవరో పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారని దాని ఫలితంగానే తాను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని నటుడు మన్సూర్ అలీఖాన్ ఆరోపిస్తూ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వేలూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనవడంతో వెంటనే అలీఖాన్ను గుడియాత్తంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తర్వాత చెన్నై కేకేనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఐసియులో చికిత్స పొందుతున్నారు. తనకు పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని ఆరోపిస్తూ … మస్సూర్ అలీఖాన్ ప్రకటన విడుదల చేశారు. తాను గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు పండ్లరసం, మజ్జిగ ఇచ్చారని… పండ్లరసం తాగిన కొద్ది నిమిషాలకే కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని ప్రకటనలో పేర్కొన్నారు.
Also read
- ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని మనస్తాపం
- భార్యతో అడ్డంగా దొరికిన ఫ్రెండ్.. ఆ తర్వాత భర్త చేసిన పనికి అంతా బిత్తరపోయారు..
- గంగావతరణం రోజున గంగానదిలో స్నానం చేయలేకపోతున్నారా.. ఇంట్లోనే ఇలా స్నానం చేయండి..
- Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో దేశంలో ఎక్కడెక్కడ రథయాత్ర జరుగుతుందో తెలుసా..
- నేటి జాతకములు 4 జూన్, 2025