విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వంకరబుద్ధి ప్రదర్శించాడు.
కంకిపాడు , : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వంకరబుద్ధి ప్రదర్శించాడు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గాంధీనగర్ ఎంపీపీ మోడల్ పాఠశాలలో మండవ శ్రీనివాస్(61) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా రెండో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ బాధిత విద్యార్థిని ఆదివారం ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీంతో ఆయన మిగిలిన బాధితుల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించి, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాలూ అందుకున్నాడు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులనిచ్చారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే