SGSTV NEWS
OperationSindoor

Pak Drone Attack: మళ్ళీ భారత్ పై పాక్ డ్రోన్  అటాక్..? ఎంతవరకు నిజం?



Pak Drone Attack: ఇండియా- దాయాది దేశాల  మధ్య కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసింది. అయితే ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే పాక్ తన వక్ర బుద్ధిని చాటుకుంది. జమ్ముకశ్మీర్ లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో, డ్రోన్ లతో దాడులు చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

జమ్ము కశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. రాజోరి, ఆర్ఎస్ పుర, అక్నూర్ లో సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతున్నట్టు సమాచారం. కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో కాల్పులు శబ్దాలు వినిపించినట్టు సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్ణయం తీసుకున్న నాలుగు గంటలకే మళ్ళీ పాక్ దాడులకు దిగుతుండడం ఏంటి అని పలువురు సోషల్ మీడియా వేదికగా ఫైరవుతున్నారు.



అయితే నిజంగా పాక్ కాల్పులకు పాల్పడిందా..? లేదా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Related posts

Share this