నెల్లూరు : వ్యక్తిపై హత్యాయత్నం చేసిన నిందితులను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులోని వేదాయపాలెం పోలీసులు ఆదివారం రాత్రి నగరంలో రోడ్డుపై నడిపించారు. పోలీసుల కథనం మేరకు.. స్టేషన్ పరిధిలోని అంబాపురం యల్లమ్మగుడి సమీపంలో నివాసం ఉంటున్న మనిదేవి అలియాస్ దేవపై ఈ నెల 16న రాత్రి రౌడీషీటర్లు రవి అలియాస్ ఏక్బాల్, కృష్ణసాయి అలియాస్ కిట్టులతో పాటు వాసు, హుస్సేన్, మరో ఐదుగురు బాలురు హత్యాయత్నం చేశారు. వాహనాన్ని పక్కకు తీయనందుకు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనపై దేవ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నగర డీఎస్పీ దీక్ష పర్యవేక్షణలో గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ సెంటరు వరకు నలుగురు నిందితులను రోడ్డుపై నడిపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
Also Read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





