నెల్లూరు: వైసీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో జరిగింది. పంట వేసేందుకు వైకాపా జడ్పీటీసీ భర్త ప్రసాదౌడ్.. కానిస్టేబుల్ రమేశ్కు అప్పు ఇచ్చారు. వర్షాలకు పంట నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో ప్రసాద్ గౌడ్ అప్పు తీర్చాలని రమేశ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో వేధింపులు తాళలేక రమేశ్ మంగళవారం లేఖ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also read
- కార్పొరేట్ స్కూల్ సూపర్వైజర్ కామ చేష్టలు
- వాల్మీకిపురంలో MLA అనుచరుల వీరంగం..టోల్ గేట్ సిబ్బందిపై దాడి
- వీడియోలతో బెదిరిస్తూ… పదేళ్లుగా లైంగికదాడి
- కట్టుకోబోయేవాడే చంపాడు..
- విద్యార్థినిపై టీచర్ ప్రేమ.. ఆమె కోసం అర్ధరాత్రి..





