చంద్రగిరి (తిరుపతి) : స్కూల్లో ఓ విద్యార్ధి కిందపడి చేయి విరిగినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదంటూ …. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన ఘటన శుక్రవారం తిరుపతిలో జరిగింది. చంద్రగిరి చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న ఓ బాలుడు మహానాయక్ కిందపడటంతో చేయి విరిగింది. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిపారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి ఫీజులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తారని, పిల్లల్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ను బాధితులు ఆశ్రయించారు. బాధితులపై స్కూల్ టీచర్లు తిరగబడ్డారు. చైతన్య టెక్నో స్కూల్లో అర్హతలేని టీచర్లు, ప్రభుత్వ నిబంధనలు పాటించంకపోవడంపై రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





