July 1, 2024
SGSTV NEWS
CrimeNational

అందమైన భార్య.. కానీ ఆమెకు ఉన్న అలవాటుతో భర్త..!

సోషల్ మీడియా అనేది కత్తిలాంటి. రెండు వైపులా పదునున్న ఉంటుంది. ఎవరు ఎలా వినియోగించుకుంటే అలా ఆ సోషల్ మీడియా అనే కత్తి అలా పనికోస్తుంది. తాజాగా ఓ కుటుంబాన్ని నిట్టనిలువునా చీల్చింది. సోషల్ మీడియాకు బానిసైన ఓవివాహిత దారుణం చేసింది.

నేటికాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా మంది ఇందులో మునిగిపోతుంటారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటంతో రోజులో ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలోనే గడుపుతుంటారు. కొందరు ఫేమస్ కావాలని, అందరు తమను గుర్తుపట్టాలని రీల్స్, వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కూడా పొగొట్టుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే సోషల్ మీడియా కారణంగా కాపురాలు కూలిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాకు బానిసైన ఓ వివాహిత చేసిన పనికి ఆమె భర్తతో సహా అందరూ షాకయ్యారు. ఇంతకు ఏం జరిగిందో, ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


సోషల్ మీడియా అనేది కత్తిలాంటి. రెండు వైపులా పదునున్న ఉంటుంది. ఎవరు ఎలా వినియోగించుకుంటే అలా ఆ సోషల్ మీడియా అనే కత్తి అలా పనికోస్తుంది. కొందరు సోషల్ మీడియాతో తమ జీవితాల్ని బాగు చేసుకున్నారు. దీన్ని ఆదాయవనరుగా మార్చుకుని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కారు. అంతేకాక కొందరు సెలబ్రిటీలతో సమానంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియా అనే కత్తికి మరోవైపుచూస్తే.. మరికొందరు ఈ ట్రెండ్‌కు బానిసలుగా మారిపోయారు. సోషల్ మీడియా లేకపోతే బతకలేనట్టు వ్యసనపరులుగా మారిపోయారు.


బీహార్‌కు చెందిన జితేంద్ర, తమన్నా పర్వీన్‌ అనే జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో ఓ పరీక్ష నిమిత్తం కోచింగ్ తీసుకునే సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వారి మధ్య ప్రేమ చిగురించేందుకు కారణమైంది. చివరకు  ప్రేమ బంధం కాస్తా వివాహ బంధంలోమారింది. పెళ్లి తరువాత తమన్నా తన పేరును సీమగా మార్చుకుంది. వారి ప్రేమకు గుర్తుగా కూడా జన్మించింది. అయితే, కొంతకాలం క్రితం సీమా సోషల్ మీడియాకు బానిసగా మారింది. రీల్స్ చేస్తూ ఎక్కువ మంది ఫాలోయవర్లను పెంచుకోవాలనే కోరికతో ఉండేది.


ఈ క్రమంలో భర్తను, పిల్లలను సైతం పట్టించుకునేది కాదు. నిత్యం ఆన్‌లైన్ ప్రపంచంలో మునిగితేలేది. ఇక సీమా తీరు ఆమె భర్తకు నచ్చక అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హెచ్చరించే వాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. చివరకు రీల్స్ పిచ్చిలో పడి ఇటీవల ఓ రోజు అతడికి చెప్పకుండా పాపను తీసుకుని వెళ్లిపోయింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన భర్త జరిగింది గుర్తించి తలపట్టుకున్నాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి.. ఆమె కోసం గాలిస్తున్నారు.

ఇలా సోషల్ మీడియా పిచ్చిలో పడి కాపురాలను కూల్చుకున్న ఆడవాళ్లు చాలా మందే ఉన్నారు. అంతేకాక కొందరు అయితే భర్త చేతిలో హత్యగావింప పడ్డారు. ఏదైనా పరిమితులకు లోపడి వాడుకుంటే ఉపయోగపడుతుంది. శృతిమించితే మాత్రం  కష్టాలను, అనార్థాలను తెచ్చి పెడుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమం పిచ్చిలో పడి కొందరు సంసారాలను నాశనం చేసుకోగా, మరికొందరు ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలా సోషల్ మీడియాలో బానిసలవుతున్నావారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Also read

Related posts

Share via