సోంపేట, : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ కోటిలింగేశ్వర ఆలయ ఆవరణలోని ఉమామహేశ్వర దేవాలయానికి చెందిన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. మొదట ఆలయంలోని విగ్రహాన్ని ఎత్తుకెళ్లి, సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట పొలాల్లో ధ్వంసం చేసి వదిలేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగినట్లుగా భావిస్తున్నారు. పోలీసు అధికారులతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆలయంతో పాటు విగ్రహాన్ని పగలగొట్టిన పొలం, ఇతర ప్రదేశాలను పరిశీలించాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పురాతన నాణేలు దొరుకుతాయన్న ఆశతో ఈ చర్యకు పాల్పడ్డారా.. లేక వేరే కారణాలున్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడికి ఎదురుగా చిన్న గదిలో అమర్చిన ఆ విగ్రహాన్ని దుండగులు తొలగించారు. గునపంతో ఓ చోట రంధ్రం చేసి పెకిలించిన ఆనవాళ్లున్నాయి.
Also read
- హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న దివ్య రహస్యం ఇదే!
- Video: ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐస్క్రీమ్ అందుకోబోయాడు.. క్షణాల్లోనే ఎవ్వరూ ఊహించని సీన్.. వీడియో చూడండి..
- Andhra: తరచూ అర్థరాత్రి వేళల్లో పోతున్న కరెంట్.. ఏంటా అని ఆరాతీస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
- పక్కా స్కెచ్.. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే





