సోంపేట, : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ కోటిలింగేశ్వర ఆలయ ఆవరణలోని ఉమామహేశ్వర దేవాలయానికి చెందిన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. మొదట ఆలయంలోని విగ్రహాన్ని ఎత్తుకెళ్లి, సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట పొలాల్లో ధ్వంసం చేసి వదిలేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగినట్లుగా భావిస్తున్నారు. పోలీసు అధికారులతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆలయంతో పాటు విగ్రహాన్ని పగలగొట్టిన పొలం, ఇతర ప్రదేశాలను పరిశీలించాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పురాతన నాణేలు దొరుకుతాయన్న ఆశతో ఈ చర్యకు పాల్పడ్డారా.. లేక వేరే కారణాలున్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడికి ఎదురుగా చిన్న గదిలో అమర్చిన ఆ విగ్రహాన్ని దుండగులు తొలగించారు. గునపంతో ఓ చోట రంధ్రం చేసి పెకిలించిన ఆనవాళ్లున్నాయి.
Also read
- భవన నిర్మాణ కార్మికుల కు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..





