సోంపేట, : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ కోటిలింగేశ్వర ఆలయ ఆవరణలోని ఉమామహేశ్వర దేవాలయానికి చెందిన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. మొదట ఆలయంలోని విగ్రహాన్ని ఎత్తుకెళ్లి, సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట పొలాల్లో ధ్వంసం చేసి వదిలేశారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగినట్లుగా భావిస్తున్నారు. పోలీసు అధికారులతో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆలయంతో పాటు విగ్రహాన్ని పగలగొట్టిన పొలం, ఇతర ప్రదేశాలను పరిశీలించాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పురాతన నాణేలు దొరుకుతాయన్న ఆశతో ఈ చర్యకు పాల్పడ్డారా.. లేక వేరే కారణాలున్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడికి ఎదురుగా చిన్న గదిలో అమర్చిన ఆ విగ్రహాన్ని దుండగులు తొలగించారు. గునపంతో ఓ చోట రంధ్రం చేసి పెకిలించిన ఆనవాళ్లున్నాయి.
Also read
- మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?
- Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్..!
- లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు..
- ఐపీఎల్ క్రేజ్ను క్యాష్ చేసుకున్న కిలాడీలు.. అసలు వీరు వాడిన టెక్నిక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..





