October 1, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024

దగ్గుపాటి ప్రసాద్ ని* *గెలిపించండి*……………… …*వై.వి.బి రాజేంద్రప్రసాద్

*అనంతపూర్ సిటీ*
*ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ గారు ఈరోజు అనంతపూర్ సిటీ లో ఎన్డీఏ  బలపరిచిన అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ మద్దతుగా పంచాయతీరాజ్ ఛాంబర్  మరియు సర్పంచ్ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి అనంతపురం పట్టణంలో విస్తృతంగా పర్యటించి   దగ్గుబాటి ప్రసాద్ ను గెలిపించాలని పట్టణ ఓటర్లను  అభ్యర్థించారు.*

*అనంతరం దగ్గుబాటి ప్రసాద్ ని కలిసి సత్కరించి అభినందించిన రాజేంద్రప్రసాద్.*


👉 *అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మా సర్పంచ్ల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ పై నమ్మకం ఉంచి మా పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దగ్గుబాటి ప్రసాద్ కి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా, శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుండు శంకరరావుకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా, పంచాయతీ రాజ్ ఛాంబర్  రాష్ట్ర కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడు కు విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా  అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి రాజేంద్రప్రసాద్ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేశారు.*

👉 ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే  స్థానిక సంస్థల కు నిధులు,విధులు,అధికారాలు పునరుద్ధరిస్తామని అలాగే సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పిటిసి లకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు గౌరవ వేతనం పెంచుతామని మేనిఫెస్టోలో  పొందుపరిచి స్పష్టమైన హామీ ఇచ్చినందుకు  ఎన్డీఏ బలపరిచిన 175 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను, 25 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించడానికి రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు కార్పొరేటర్లు కృషి చేయాలని రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.

👉అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతేనే గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు మనుగడ ఉంటుందని రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.

👉స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులకు, ఎంపిటిసి లకు, జడ్పిటిసిలకు కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు  నిధులు,విధులు, అధికారాలు మరియు గౌరవం దక్కాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని  రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.

👉ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా గ్రామీణ ప్రజలకు అభివృద్ధి మరియు సంక్షేమం అందాలన్నా పట్టణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సర్పంచ్ లు,ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కృషి చేయాలని రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి,ఉమ్మడి అనంతపూర్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు వెంగమ నాయుడు ,పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, వీరేష్ ,రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via