కృష్ణరాజపురం: నగరంలోని కోరమంగళలో భార్యను రోడ్డుపై హత్య
చేసి పరారైన కిరాతక భర్తని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్నేయ డీసీపీ సి.కే. బాబా తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 2వ తేదీన కోరమంగళ పరిధిలోని వెంకటపురలో హత్య జరిగింది. ఇందు (28) ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తూ నివసిస్తోంది.
ఆమె భర్త మైకేల్ ఫ్రాన్సిస్ (33), వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రాన్సిస్ పెయింటర్గా పనిచేస్తూ జులాయిగా తిరిగేవాడు. దీంతో ఐదు నెలల కిందట భార్య పుట్టింటికి వచ్చేసింది. ఫ్రాన్సిస్ ఆ రోజు భార్య వద్దకు వచ్చి గొడవపడి ఆమెను రోడ్డుపైనే పొడిచి చంపి పరారయ్యాడు. పోలీసులు విచారణ జరిపి నిందితున్ని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలే హత్యకు కారణమని చెప్పారు.
Also read
- ఈ 4 రాశులకు వరంలా లక్ష్మీ నారాయణ యోగం.. డబ్బు, విజయాలు, విలాస జీవితం ఇక ఖాయం!
- నరక లోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట
- నేటి జాతకములు…27 ఏప్రిల్, 2026
- లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
- కార్మిక చట్టాల అమలు కు దీక్షాదినంగా మేడే….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.





