విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
కాకినాడ: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు దిగజారి ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలకు చేరుకొని అతడికి దేహశుద్ధి. చేశారు. ఈ ఘటన కాకినాడలోని జగన్నాథపురం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగింది.
గణితం బోధిస్తున్న శ్రీనివాసరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో శ్రీనివాసరావు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్పి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Also read
- విహారయాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన నవ వధువు.. హోమ్స్టేలో రక్తపు మడుగులో మృతి
- నిజ జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం- ఈ నెలలో వచ్చే పర్వదినాలు, పుణ్య తిథులు ఇవే!
- Garuda Purana : అమ్మ కడుపులో ఉన్నప్పుడే నరకం మొదలైపోతుందా, గరుడ పురాణం ఏం చెబుతోంది
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..




