Kakinada Crime: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెంలో జరిగింది. గ్రామ శివారులో జీడిమామిడి తోటను ఆనుకుని ఉన్న ఇంట్లో దానబోయిన చిన్నబుల్లి (68) నివాసముంటున్నారు. బర్రెకు నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. 20కి పైగా కోతులు మీదపడి దాడి చేయడంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది.
దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నబుల్లి తనకు ఉన్న మూడెకరాల తోటలో తన కూతురు కుటుంబంతో కలిసి అక్కడే నివాసముంటోంది. ఈ ప్రాంతంలో కోతుల దాడిలో గాయపడిన ఘటనలు చాలా జరిగాయని గామస్తులు తెలిపారు. ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని వాపోయారు.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్టాప్గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





