కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని కడప జైల్లో బెదిరించిన ఘటనపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మరోసారి విచారణ చేపట్టారు. హత్య కేసు నిందితులకు కడప జైల్లో సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్తోపాటు, అభియోగాలు ఎదుర్కొంటున్న వైద్యురాలు పుష్పలత, ప్రవీణ్ను ఎస్పీ విచారించారు. రెండు వారాల క్రితం ఓ రోజంతా ఇప్పటికే వీరిని విచారించారు. 2023 నవంబర్లో జైలు అధికారుల అండతో తనను చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యుల బృందంతో కమిటీ వేసింది.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





