మోగల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో అమానవీయ ఘటన (Crime News) చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ భార్య, ఆమె బంధువులు ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు. మంగళవారం రాత్రి నుంచి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన సామాజిక మధ్యమాల్లో వైరల్ కావడంతో పాలకోడేరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధిత మహిళను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవివర్మ తెలిపారు
Also read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





