మోగల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో అమానవీయ ఘటన (Crime News) చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ భార్య, ఆమె బంధువులు ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు. మంగళవారం రాత్రి నుంచి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన సామాజిక మధ్యమాల్లో వైరల్ కావడంతో పాలకోడేరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధిత మహిళను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవివర్మ తెలిపారు
Also read
- హీటర్ ప్రాణం తీసింది..
- ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
- ఐ.యఫ్.టి.యు అధ్యక్ష, కార్యదర్శులు గా పామర్తి సత్య, గెడ్డం రవీంద్ర లు.
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వాస్తు టిప్స్ : ఇంటిలోకి పాము రావడం శుభమా? అశుభమా?





