ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్, నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నక్సల్స్ పెద్ద సంఖ్యలో హతమయ్యారు. 2 వారాల వ్యవధిలో ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ డీఆర్జీ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. గాలింపు చేస్తూ నక్సల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎన్కౌంటర్ సమయంలో మరికొందరు నక్సల్స్ పరారయ్యారని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఘటనాస్థలం నుంచి ఏకే 47 తుపాకీ, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో ఏప్రిల్ 16న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాటి కాల్పుల్లో 29 మంది మరణించారు. మృతుల్లో ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన అగ్ర నాయకులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ అడవుల్లో దాదాపు 90 మంది నక్సల్స్ను భద్రతా సిబ్బంది హతమార్చారు.
మావోయిస్టుల కీలక స్థావరంగా భావించే ఛత్తీస్గఢ్ అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలోకి జొచ్చుకుపోయిన పోలీస్ బలగాలు అణువణువునూ గాలిస్తున్నాయి. మావోయిసట్ఉలను పెద్ద సంఖ్యలో మట్టుబెడుతున్నాయి.
Also read
- Hyderabad: అంత ఈజీగా ఎలా నమ్ముతారో.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
- Hyderabad: పెళ్లి పేరుతో వంచన.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. !
- ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!
- Andhra News: ఎలా వస్తున్నాయ్రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్ను చంపి ఏం చేశాడో తెలిస్తే..
- పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి





