రైల్లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు.
రైల్లో హిజ్రాలు రెచ్చిపోయారు. ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా రూ. 10వేలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలులో సదురు ప్రయాణికుడి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన వాళ్లు ఆపై అతని వద్ద పర్సు లాక్కున్నారు. అందులోని రూ.10 వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఏంటీ దౌర్జన్యం అని ప్రశ్నిస్తే తోసేసి పరారయ్యారు
నలుగురు హిజ్రాలు అరెస్ట్
బాధితుడి ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరికి చెందిన సూర్య భాను ప్రకాష్, జనగామకు చెందిన విజయ్, భద్రాద్రి కొత్తగూడెంకు జిల్లాలకు చెందిన సాయికుమార్తో పాటు మరో మైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పది నెలల క్రితం సూరారంలో రహదారులపై భిక్షాటన చేసే వారని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా రైళ్లలో బలవంతంగా హిజ్రాలు ఇలా డబ్బులు లాక్కుంటున్నారని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు హెచ్చరించారు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





