July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

AP News: పింఛన్ డబ్బుల కోసం గొడవపడి.. కన్నతండ్రినే హతమార్చాడు..

పించన్ డబ్బుల కోసం గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన ఘటన కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో కలకలం రేపుతోంది. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్గాలయ్య అనే వ్యక్తి నిన్న పింఛన్ సొమ్ము అందింది.



కర్నూలు: పించన్ డబ్బుల కోసం గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన ఘటన కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో కలకలం రేపుతోంది. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్గాలయ్య అనే వ్యక్తి నిన్న పింఛన్ సొమ్ము అందింది. ఈ పింఛన్ డబ్బుల విషయమై దర్గాలయ్యకు అతని కుమారుడు నాగశేషులుకు గొడవ జరిగింది. మద్యం మైకంలోఉన్న నాగశేషులు.. తండ్రి దర్గాలయ్యపై కర్రతో దాడి చేశాడు. దీంతో దర్గాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share via