పించన్ డబ్బుల కోసం గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన ఘటన కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో కలకలం రేపుతోంది. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్గాలయ్య అనే వ్యక్తి నిన్న పింఛన్ సొమ్ము అందింది.
కర్నూలు: పించన్ డబ్బుల కోసం గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన ఘటన కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో కలకలం రేపుతోంది. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్గాలయ్య అనే వ్యక్తి నిన్న పింఛన్ సొమ్ము అందింది. ఈ పింఛన్ డబ్బుల విషయమై దర్గాలయ్యకు అతని కుమారుడు నాగశేషులుకు గొడవ జరిగింది. మద్యం మైకంలోఉన్న నాగశేషులు.. తండ్రి దర్గాలయ్యపై కర్రతో దాడి చేశాడు. దీంతో దర్గాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- హెల్మెట్ ఉన్నా దక్కని ప్రాణం.. ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- మైలవరంలో విషాదం.. నదిలో మునిగి అత్త, అల్లుడు మృతి
- ఇద్దరు మహిళలతో భర్త.. చూసి పూనకంతో ఊగిపోయిన భార్య.. ఆ తర్వాత..!
- బస్సులో తెరచుకున్న అత్యవసర ద్వారం.. కిందపడి బాలికకు తీవ్రగాయాలు
- భార్య, అత్తామామల దాడి.. ఆర్మీ ఉద్యోగి మృతి





