దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా యువతను రీల్స్ పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పుర్లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
నాగపూర్ : దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా యువతను రీల్స్ పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పుర ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల ఆకాశ్ చకోలే ఆగస్టు 15న స్నేహితులతో కలిసి మకర్తోక్గా డ్యామ్కు వెళ్లాడు. వర్షాల కారణంగా డ్యామ్ నిండి అలుగు పారుతోంది. దీంతో పర్యాటకులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆకాశ్ తనతోపాటు వచ్చిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రమాదకర విన్యాసానికి ప్రయత్నించాడు. ముగ్గురూ డ్యాం గోడను ఎక్కే ప్రయత్నం చేశారు. వారిలో ఆకాశ్ ఒక్కడే గోడపైకి చేరగలిగాడు. నీటి లీకేజీ కారణంగా జారుతుండటంతో ప్రమాదం శంకించిన మిగతా ఇద్దరూ ఆకాశ్ను కిందకు లాగేందుకు చేయందించారు. గోడపై చేరిన ఆనందంలో చేతులు ఊపిన ఆకాశ్ ప్రమాదవశాత్తూ పట్టు కోల్పోయి వెనుక ఉన్న డ్యామ్లో పడిపోయాడు. రెస్క్యూ బృందాలు మృతదేహాన్ని బయటకు తీశాయి.
Also read
- పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!





