గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఫిరంగిపురం : గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాలశాఖ అధికారి దేవరాజ్, తహసీల్దారు ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. ఫిరంగిపురంలోని రాఘవేంద్ర రైసు మిల్లులో ఆదివారం సోదాలు నిర్వహించారు. మిల్లులో బంకర్లు ఉండగా ఒక దానిలో బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అది రేషన్ బియ్యంగా నిర్ధారణ కావడంతో యాజమాన్యాన్ని ఆరా తీశారు. ఎలాంటి అనుమతులూ లేవని చెప్పడంతో మొత్తం 12 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Also Read
- భార్య కోసం.. రేడియో టవర్ ఎక్కిన యువకుడు
- అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో ఓ వ్యక్తి ఎంత అసహనానికి గురయ్యాడంటే..
- Telangana: ఇంతకాలం టైంపాస్కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
- మామిళ్ళగూడెం మృత్యుఘోష.. నిన్న తండ్రి, కూతురు.. నేడు తల్లి.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
- స్క్రీన్ ప్లే అదిరింది కానీ.. సీన్ మార్చేసిన క్యూఆర్ కోడ్! చండ్రుపట్ల కాలువ మృతదేహం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!





