గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఫిరంగిపురం : గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని ఓ రైసు మిల్లు బంకర్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాలశాఖ అధికారి దేవరాజ్, తహసీల్దారు ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. ఫిరంగిపురంలోని రాఘవేంద్ర రైసు మిల్లులో ఆదివారం సోదాలు నిర్వహించారు. మిల్లులో బంకర్లు ఉండగా ఒక దానిలో బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అది రేషన్ బియ్యంగా నిర్ధారణ కావడంతో యాజమాన్యాన్ని ఆరా తీశారు. ఎలాంటి అనుమతులూ లేవని చెప్పడంతో మొత్తం 12 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Also Read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్లో.. భార్య కడపలో.. డ్రైవర్తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





