మహబూబాబాద్ జిల్లాలో ఫుడ్పాయిజన్ కలకలం రేపింది. గూడూరు మండలంలోని దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులు స్వల్పంగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరికి హాస్పటిల్లో చికిత్స అందిస్తున్నారు
రాష్ట్రంలోని గురుకులాల్లో రోజు రోజుకు వైఫల్యం లోపిస్తోంది. విద్యార్థులకు భోజనం విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. తరచూ ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికి చాలా ప్రాంతాల్లోని గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్ పాలయ్యారు. తాజాగా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో అలాంటిదే మరొకటి జరిగింది.
ఫుడ్ పాయిజన్
గూడూరు మండలంలోని దామరవంచ తెలంగాణ సాంఘీక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. రాత్రి సాంబార్తో పాటు బొబ్బర్లు తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 16 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురికాగా.. మరో నలుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో గూడూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వారిని తరలించారు. ఆ నలుగురు విద్యార్థులకు విపరీతమైన వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. వైద్యులు వెంటనే వారికి ట్రీట్మెంట్ అందించడంతో ప్రస్తుతం వారి పరిస్థితి పర్వాలేదని తెలుస్తోంది. అయితే ప్రిన్సిపల్, వార్డెన్ ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో విషయం తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల మరొకటి
ఇటీవల కామారెడ్డి – ఎల్లారెడ్డి పట్టణ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇలా జరగడానికి కారణం.. విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టడమేనని తెలుస్తోంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారికి ఆసుపత్రిలో చికిత్స అందించారు.
సూర్యపేటలో
ఇలాంటిదే ఇటీవల రాష్ట్రంలో మరో ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. ఫుడ్ వికటించడంతో వసతి గృహంలో ఉంటున్న 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!