Eluru News: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ
మధ్యకాలంలో ర్యాగింగ్ భూతం తీవ్ర రూపం దాల్చుతోంది. దీనిబారిన పడిన విద్యార్థులు చివరకు ఫైటింగ్కు దిగుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఏలూరు మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశం చేసి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగింది?
ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్లో మూడో ఇయర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. అంతేకాదు వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కొన్నాళ్లుగా ఈ ఘటన జరుగుతున్నా, విద్యార్థులు ఈ విషయాన్ని బయటపెట్టకుండా మౌనం వ్యవహరించారు.
అయితే రోజురోజుకూ సీనియర్ల ఆగడాలు శృతి మించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్కు దారి తీసింది. చివరకు 15 మంది సీనియర్లు తమను వేధిస్తున్నారని జూనియర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు హాస్టల్కు చేరుకుని విచారణ చేపట్టారు.
అర్ధరాత్రి సీనియర్లు-జూనియర్ల మధ్య ఫైటింగ్
సీనియర్లు చెప్పిన పనులు చేయకుంటే దాడులు చేస్తున్నారని వివరించారు. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ మధ్యకాలం మంగళగిరి ఎయిమ్స్ ఈ తరహా వ్యవహారం చోటు చేసుకుంది. దీంతో పలువురు విద్యార్థులను ఇంటికి పంపారు. ఇప్పుడు ఏలూరు వంతైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Also Read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





