కారులో ఆడుకుంటున్న బాలుడు డోర్ లాక్ పడి ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
నంద్యాల జిల్లా డోన్ లో విషాదం
డోన్ : కారులో ఆడుకుంటున్న బాలుడు డోర్ లాక్ పడి ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. డోన్ మండలం దొరపల్లె గ్రామానికి చెందిన మోహన్, ధనలక్ష్మి దంపతుల మూడో కుమారుడు ఈశ్వర్(11) బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన బంధువుల కారులోకి ఎక్కగానే ఒక్కసారిగా డోర్ లాక్ పడింది. కారు లాక్ తెరవడం రాక, చాలాసేపు కాళ్లతో చేతులతో అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అద్దాలు పగలకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈశ్వర్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. సుమారు మూడు గంటల తర్వాత బాలుడు కారులో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Also read
- సర్వేయర్ హత్య కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
- Andhra News: టీడీపీ నేత హత్య కేసులో కీలక పరిణామం.. పోలీసుల కస్టడీకి నలుగురు కీలక నిందితులు!
- Atmakur: ఏఈ శరభారెడ్డి డ్యూటీకి – ఇంట్లో వాళ్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్కి – తిరిగి వచ్చేసరికి
- Andhra: వామ్మో.. వాళ్లు అలా వచ్చేది అందుకోసమేనా.. ముగ్గురి ప్రాణాలు తీసిన కిలాడీ ముఠా..
- Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..