కారులో ఆడుకుంటున్న బాలుడు డోర్ లాక్ పడి ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
నంద్యాల జిల్లా డోన్ లో విషాదం
డోన్ : కారులో ఆడుకుంటున్న బాలుడు డోర్ లాక్ పడి ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. డోన్ మండలం దొరపల్లె గ్రామానికి చెందిన మోహన్, ధనలక్ష్మి దంపతుల మూడో కుమారుడు ఈశ్వర్(11) బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన బంధువుల కారులోకి ఎక్కగానే ఒక్కసారిగా డోర్ లాక్ పడింది. కారు లాక్ తెరవడం రాక, చాలాసేపు కాళ్లతో చేతులతో అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అద్దాలు పగలకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈశ్వర్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. సుమారు మూడు గంటల తర్వాత బాలుడు కారులో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Also read
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..
- అప్పులపాలైన వ్యక్తిని.. అయ్యో పాపమని చేరదీసిన వృద్ధురాలు.. ఏం చేశాడో తెలుసా?