కామారెడ్డి జిల్లా బ్యూరో ఆగస్టు 16 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు ఈవీఎం గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు.వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎం గోదాం తాళాలను తీయించారు.గోదాంలో ఉన్న చెడిపోయిన ఈవీఎంలను పరిశీలించారు.

ఈవిఎంలకు సంబంధించిన రిజిస్టర్లను చూశారు.ఈవీఎంలను ఈసీఎల్,బెంగళూరు,బెంక్,బిహెచ్ఎల్ కంపెనీలకు పంపుతామని ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవోలు రఘునాథరావు,ప్రభాకర్,ఎన్నికల విభాగం అధికారులు ప్రేమ్ కుమార్,అనిల్ కుమార్,ప్రియదర్శిని,రాజకీయ పార్టీల ప్రతినిధులు నిరంజన్,కాసిం,తదితరులు పాల్గొన్నారు.
Also read
- ఈ దేవిని దర్శిస్తే చాలు.. జీవితమే మారిపోతుందా? అపరాజిత దేవి రహస్యం!
- గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఆ ఇంట
- రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్ చెక్ చేయగా..




