దేవాలయ హుండీలో సొమ్ము కాజేయడానికి ప్రయత్నించిన ఒక దొంగ చెయ్యి అందులో ఇరుక్కుపోవడంతో 12గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో గల మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయంలో పనిచేసే సురేష్ రాత్రి 10 గంటల ప్రాంతంలో హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు.
అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చేయ్యి పెట్టాడు. అయితే సురేష్ చేయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది.దీంతో సుమారు 12 గంటల పాటు సురేష్ నరకయాతన అనుభవించాడు. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వచ్చి పోలీసుల సమక్షంలో గ్యాస్ కట్టర్తో సురేష్ చేతిని హుండీలోంచి తొలగించారు. అనంతరం దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానిక భిక్కనూర్ పోలీసులకు అప్పగించారు
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు