భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 17: బూర్గం పాడు మండలం మోతే అటవీ ప్రాంతంలో ఈ నెల 14న జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం గన్నవరానికి చెందిన కట్ట యశ్వంత్ గతంలో ఐటిసి కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసేవాడు. కొన్ని కారణాలవల్ల ఉద్యోగం పోవడంతో ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన కట్ట సాయి దీపక్, భద్రాచలానికి చెందిన కొండ భాను ప్రకాశ్ లు పరిచయం అవడంతో ముగ్గురు స్నేహితులుగా మారిపోయారు. కట్ట యశ్వంత్, కట్టా సాయి దీపక్ ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారవడంతో వారి మధ్య స్నేహం ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో సాయి దీపక్ కుటుంబం నిర్వహించే ఫెర్టిలైజర్ షాపులో పనిచేస్తూ వారికి చేదోడువాదోడుగా ఉండేవాడు.
ఈ నేపథ్యంలోనే సాయి దీపక్ అతని స్నేహితుడు భాను ప్రకాష్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈజీగా కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశారు. కట్ట యశ్వంత్, కట్టా సాయి దీపక్ కులాలు వేరైనా ఇంటిపేర్లు ఒకటే కావడంతో యశ్వంత్ పేరు మీద బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నవంబర్ 2025లో కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ చేపించాడు సాయి దీపక్. అన్న గా తన పేరును నామినీగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 14వ తారీకు రాత్రి వీరు ముగ్గురు కలిసి బూర్గంపాడు మండలం మోతె అటవీ ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు. అనంతరం యశ్వంత్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడని సాయి దీపక్, భాను ప్రకాష్ లు అతనిని భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
Also read
- ఊయలే ఉరితాడైందా.. లేక మరేమైనా జరిగిందా..? చిన్నారి మృతి కేసులో మిస్టరీ..
- శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ భార్యపై చిందులు.. ఆపై ఉరి వేసుకుని భర్త సూసైడ్! ఎక్కడంటే..
- దేవదాసు ఎంత పని చేశాడు.. చర్చికి వెళ్దామని మహిళను అడవిలోకి తీసుకెళ్లి..
- వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త
- విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్ ఇదే!





