Hyderabad: హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో
మద్యం మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. మాదాపూర్లోని గూగుల్ ఆఫీస్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న యువకులు అతివేగంగా కారు నడుపుతూ, అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేశారు. అంతటితో ఆగకుండా.. బస్సుకు అడ్డంగా కారును నిలిపి డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు.
ఈ గొడవ కాస్తా ముదిరి, యువకులు బస్సు డ్రైవర్పై భౌతిక దాడికి పాల్పడ్డారు. పట్టపగలే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు చూస్తుండగానే.. యువకులు ఆవేశంతో బస్సుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో వారు చేస్తున్న రచ్చను ఆపడానికి ప్రయత్నించిన వారిని కూడా యువకులు దుర్భాషలాడినట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని, విధుల్లో ఉన్న తనపై దాడి చేశారని డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Also read
- అతివేగం మిగిల్చిన అనంత విషాదం.. ముగ్గురు బలి.. మూడేళ్ల క్రితం అమ్మ.. ఇప్పుడు నాన్న దూరం..!
- Telangana: మెగుడే యముడయ్యాడు.. అదనపు కట్నం మోజులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు!
- స్వామివారికి దాతలిచ్చిన బంగారు కిరీటం తాకట్టు – వచ్చిన డబ్బుతో వ్యాపారం
- Gudiwada Temple గుడివాడ ఆలయంలో కోటి రూపాయల కిరీటం మాయం.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ
- స్నానం చేయమన్నందుకు ఏకంగా బావిలోకి దూకింది..ఈ అసాధ్యురాలు




